PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త తదుప‌రి ప్ర‌ధాని ఎవ‌రంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం హిమంత శర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసోంలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత ప్రధానిగా, ప్రధాని నరేంద్ర మోదీని హోం మంత్రిగా సంభోదించారు. ఆయన వ్యాఖ్యలు విన్న సభలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, సీఎం అనుకోకుండా నోరుజారారని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత సమర్ధించే ప్రయత్నం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ వీడియోలను ట్రోల్ చేస్తూ అధికార బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా అమిత్ షానే ఎంచుకుందని, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేసింది.

                                       

About Author