PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి చేసేది ఎవరో ఆలోచించాలి : టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలును అభివృద్ధి చేసేది ఎవరో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం నగరంలోని 49 వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమంతో పాటు ఒక్క రోజు అన్న క్యాంటిన్ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తో కలిసి టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు పెట్టుకున్నామన్నారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే కర్నూలు ప్రజలకు అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే అన్న క్యాంటిన్లను ఈ ప్రభుత్వం తీసివేసిందన్నారు. అందుకే వీటి ప్రాధాన్యత తెలియడం కోసం ప్రతి వార్డులో ఒక్క రోజు అన్న క్యాంటిన్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. అభివృద్ధి ఎవరు చేస్తారన్నది ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలని తాను కోరుతున్నట్లు భరత్ చెప్పారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కర్నూలుకు అభివృద్ధి కావాలంటే టిజి భరత్ ఎమ్మెల్యే అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి విక్రమ్ సింగ్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, తెదేపా నగర అధ్యక్షుడు గున్నామార్క్, నేతలు గోపీనాథ్ రెడ్డి, శంకర్ సింగ్, గణేష్ సింగ్, రాజేందర్ సింగ్, నాగేంద్ర సింగ్, సాయి, రాజు, పరమేష్, అక్బర్, హనుమంతు, వివిద వార్డుల ఇంచార్జీలు, నేతలు, తదితరులు పాల్గొన్నారు.

About Author