PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా కార్య‌క‌ర్త‌ల్ని చంపినా అడిగేవారెవ్వ‌రు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంటల్లో చిక్కుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చండూరులో ఇవాళ రేవంత్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కచ్చితంగా ప్రత్యర్థి పార్టీల చర్యేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనను ఉపేక్షించరాదని, ఇవాళ ఈ ఘటన జరిగింది, రేపు మరొకటి జరుగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని కూడా వదిలేసి తాడోపేడో తేల్చుకోవడానికి కూర్చున్నారని వెల్లడించారు. ఎందుకంటే, ఈ ఘటనను తేలిగ్గా వదిలిస్తే, రేపు తమ కార్యకర్తలను చంపేసినా అడిగేవారెవ్వరు? అని వీహెచ్ వ్యాఖ్యానించారు.

                                         

About Author