NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“వై ఏపీ నీడ్స్ జగన్”

1 min read

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి…

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచిని, రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఈ ప్రభుత్వం చేసిన మేలుని ప్రజలకి తెలియజేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈరోజు జగనన్న పాలనలో తీసుకొచ్చిన మార్పు ప్రతి గ్రామంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం మేలైన సేవలు అందిస్తున్నాయి. పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా వచ్చిన మార్పులు.. ఇంగ్లిష్‌ మీడియం, పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే ఐఎఫ్‌ఫీ ప్యానెల్స్, ఎనిమిదో తరగతిలో ట్యాబుల పంపిణీ వరకూ మారుతున్న విద్యా వ్యవస్థ మన కళ్లముందే కనిపిస్తుంది. మరోవైపు సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలను అమలుచేస్తుంది. ఆ పథకాల వల్ల ప్రజలందరూ లబ్ధి చెందుతున్నారు. అందుకే ఈ రాష్ట్రానికి YS జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి గా ఉండడం అవసరం. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వీరేష్,గ్రామ సర్పంచ్ నాగరాజు,ఎంపీటీసీ షేక్ వల్లి,మండల సచివాలయ కన్వీనర్ బొగ్గుల ఈరన్న,. నాయకులు  ఉరుకొందప్ప, వెంకటేష్,వీరేష్,తిక్కన,చంద్రప్ప ,మునిస్వామి నాయక్ , వరుణ్,  తదితరులు పాల్గొన్నారు.

About Author