PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌త్యం మీ వైపు ఉంటే ఎందుకు బ‌య‌ప‌డాలి ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలవాలని మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తనకు కూడా ఆఫర్ ఇచ్చారని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నారు. తాను ఆ ఆఫర్‌ను తోసిపుచ్చానని సంజయ్ రౌత్ శనివారం తెలిపారు. శివసేన నేతల తిరుగుబాటుతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది. దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ, తనకు కూడా గౌహతి వెళ్లాలంటూ ఆఫర్ వచ్చిందని, అయితే తాను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను అనుసరించే వ్యక్తిగా ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. ”సత్యం మీ వైపు ఉన్నప్పుడు, ఎందుకు భయపడాలి?” అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

                                          

About Author