PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే  ప్రచార కార్యక్రమాన్ని నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు, 24వ వార్డు పరిధిలోని 3వ సచివాలయం పరిధిలో నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ కిషోర్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్‌ రాహత్‌ జబ్బార్‌ , వైయస్సార్సీపి పట్టణ అధ్యక్షులు షేక్ మన్సూర్  పట్టణ జేసిఎస్ కన్వీనర్ అబూబక్కర్, 3 వ వార్డు కౌన్సిలర్ అల్లూరి కృష్ణ, 24 వ వార్డు కౌన్సిలర్ చాంద్ భాష అధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటి ఇంటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే  అని ప్రజలకు వివరించి 2014 లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, 2019 లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కర పత్రం ను ప్రజలకు ఇచ్చి వివరించి, ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసిన ఘనత ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఒక్కరే అని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ ప్రధాన కార్యదర్శి  మార్కెట్ రాజు,   జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సులోచనమ్మ, ఉస్మాన్ బేగ్ ,కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫర్ మున్సిపల్ కౌన్సిలర్లు లాలు ప్రసాద్ , రావుఫ్, హమీద్, చిన్న రాజు, పార్టీ నాయకులు, జబ్బార్, ఆర్ట్ శీను, డి.రమేష్, సిద్ధార్థ రెడ్డి  అభిమానులు,  అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author