PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ ను ఎందుకు ఓడించ‌కూడ‌దు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్‌ను ఎందుకు ఓడించకూడదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య జ‌రిగి మూడేళ్లు అయిందని, ఆ కేసు ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చెల్లెలు డాక్టర్ సునీత రెడ్డి రక్షణ కావాలంటూ కడప ఎస్పీకి లేఖ రాశారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో పెద్ద కుడాల నాగమ్మ, పులివెందుల శివరాణి , వీరమ్మ, కోమన్నూతల మునెప్ప ఇలా ఎందరో హత్య కావించబడ్డారన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదని, శాంతి భద్రతల వైఫల్యం ఒక్కటీ చాలదా జగన్‌ను ఓడించడానికి అని అన్నారు.

                                              

About Author