NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీఆర్సీ నివేదిక ఉద్యోగ సంఘాలకు ఎందుకు ఇవ్వడం లేదు ?

1 min read

పల్లెవెలుగువెబ్ : పీఆర్సీ నివేదిక ఉద్యోగ సంఘాలకు ఎందుకు ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరెంటు కోతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉద్యోగసంఘాల సమస్యలపై జగన్ సర్కర్ చర్చించకుండా… ప్రభుత్వం కావాలనే వారిని పిలిచి ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల మనోభావాలను గుర్తించాలని రామకృష్ణ అన్నారు.

      

About Author