PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జైల్లోని వ్యక్తి ద‌గ్గర క‌త్తి ఎందుకు ఉంది : టీడీపీ అధినేత

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జైల్లో ఉన్న వ్యక్తి ద‌గ్గర క‌త్తి ఎందుకు ఉంద‌ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జ‌డ్జి రామ‌కృష్ణను హ‌త్య చేసే ఉద్దేశంతోనే అత‌ని బ్యార‌క్ లోకి మ‌రో వ్యక్తిని పంపించార‌ని చంద్రబాబు ఆరోపించారు. అప‌రిచిత వ్యక్తి వ‌ద్ద క‌త్తి ఎందుకు ఉందో విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. న్యాయ‌వ్యవ‌స్థ ప్రతిష్టకు అండ‌గా నిలిస్తే కేసులు పెడ‌తారా? అంటూ ప్రశ్నించారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కక్షపూరితంగా జ‌డ్జి రామ‌కృష్ణను జైల్లో పెట్టించారా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జ‌గ‌న్ మీద ప్రజ‌ల్లో ద్వేషం క‌లిగించే విధంగా ప్రయ‌త్నిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల మీద‌.. జ‌డ్జి రామ‌కృష్ణను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. మెజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌ర‌చ‌గా.. 14 రోజుల రిమాండ్ విధించారు. జ‌డ్జి రామ‌కృష్ణ ప్రస్తుతం పీలేరు స‌బ్ జైల్లో ఉన్నారు.

About Author