PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ గా వెన్నపూస రవీంద్రారెడ్డి గెలుపుకై విస్తృత ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ల ఆదేశాల మేరకు గోనెగండ్ల లో ఆయా ప్రభుత్వ కార్యాలయంలో పట్టభద్రుల ఓటు కోసం గురువారం ప్రచారం చేసిన మండల యూత్ ప్రెసిడెంట్ బందె నవాజ్ ఆధ్వర్యంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎన్నికల్లో భాగంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నెపూస రవీంద్రా రెడ్డి ని మూడో సంఖ్యలో ఫోటో ఎదురుగా ఒకటి అనే సంఖ్యను మాత్రమే వ్రాయాలని బందె నవాజ్ పట్టభద్రులకు విన్నవించుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ రాబోయే కాలంలో శాసనమండలి సభ్యులను శాసనమండలికి పంపాలని పట్టబద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల జెసిఎస్ కన్వీనర్ మనోహర్ రెడ్డి మండల కన్వీనర్ దొరబాబు, సచివాలయ కన్వీనర్ చికెన్ రాజా,కె మహబూవలి, మాజీ కన్వీనర్ గోవిందు, పేట అల్లా బకాష్, ఎం మునుస్వామి, మద్దిలేటి, చంటి, మండల సోషల్ మీడియా కో కన్వీనర్ మహమ్మద్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author