NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భీమ్లా నాయక్‌కి వైఫ్‌గా

1 min read

సినిమా డెస్క్​ : పవన్ కళ్యాణ్‌, రానా ఇద్దరూ నటిస్తున్న సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్’. ఇది మలయాళ రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్‌ కళ్యాణ్ పవర్‌‌ఫుల్‌ రోల్‌ భీమ్లా నాయక్‌గా పోలీసాఫీసర్‌‌ క్యారెక్టర్‌‌లో కనిపిస్తున్నారు. పవన్‌తో పాటు అంతే పవర్‌‌ఫుల్‌ రోల్‌లో రానా నటిస్తున్నారు. షూటింగ్‌ కూడా యమా స్పీడ్‌గా జరుగుతోంది. అయితే పవన్‌కి జోడీగా నిత్య మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌తో ఆమె హీరోయిన్ గా నటించడం ఇదే తొలిసారి. నిన్నటి నుండి ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా నిత్య ఫోటోని రివీల్‌ చేసింది టీమ్. పవన్, నిత్య కాంబినేషన్ సీన్స్ తీస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ఏజన్సీ ఏరియాలో సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసే భీమ్లా నాయక్‌కి భార్యగా గిరిజన మహిళా పాత్రలో నటిస్తోంది నిత్య. మాజీ మావోయిస్టుగా రెబల్ క్యారెక్టర్ లో నిత్య కనిపించనుంది. ఇక నిత్య రెండు మలయాళ సినిమాల్లోనూ, తెలుగులో సత్యదేవ్‌తో కలిసి ‘స్కైల్యాబ్‌’ మూవీలో నటిస్తోంది.

About Author