PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అడ్డంగా అడ‌వి పందులు.. మంత్రి హ‌రీష్ కు ప్రమాదం ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావుకు ప్రమాదం త‌ప్పింది. సిద్దిపేట స‌మీపంలోని రాజీవ్ ర‌హ‌దారి మీద అడ‌వి పందుల గుంపు కారుకి అడ్డం రావ‌డంతో ప్రమాదం జ‌రిగింది. ఒక్కసారిగా అడ‌వి పందుల గుంపు రోడ్డు మీద‌కి రావ‌డంతో.. పైలట్ వాహ‌నం స‌డ‌న్ బ్రేక్ వేశారు. దీంతో వెనుక ఉన్న కార్లు ఒకదానితో మ‌రొకటి ఢీకొన్నాయి. అయితే.. ఎవ‌రికీ ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌లేదు. మూడు వాహ‌నాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంత్రి హ‌రీష్ రావు వాహ‌నం దిగి ప‌రిస్థితిని ప‌రిశీలించారు. వాహ‌ణ శ్రేణిలోని చివ‌రి వాహ‌న డ్రైవ‌ర్ మాణిక్యంకు స్వల్పగాయాలు అయ్యాయి. సిద్దిపేట పోలీస్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ సంఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించారు.

About Author