PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందుబాటులో ఉంటా…సేవ చేస్తా..

1 min read

వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​

కర్నూలు, పల్లెవెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండి… సేవ చేస్తానని… ఒక్క సారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​. సోమవారం  ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా  నగరంలోని 10వ వార్డు లో కర్నూలు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ A.Md . ఇంతియాజ్, కర్నూలు పార్లమెంట్ వైసిపి అభ్యర్థి శ్రీ BY రామయ్యకు ప్రజల నుండి విశేష స్పందన  వచ్చింది. వీరిద్దరినీ కచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పడం ఎంతో హర్షించదగ్గ విషయమని, వీరందరికీ అన్నివేళలా అండగా ఉంటామని వైసీపీ అభ్యర్థులు వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి, కర్నూలు నంద్యాల జిల్లాల వైసిపి కోఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి , వైసీపీ సీనియర్ నాయకులు అహ్మద్ అలీ ఖాన్, శ్రీ తెర్నేకల్ సురేందర్ రెడ్డి , మొయిద్ ఖాన్, నగర కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author