NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

30 ఏళ్లు సీఎంగా ఉంటారు.. ప్రధాని స్థాయికి ఎదుగుతారు !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప‌తాక స్థాయిలో పొగిడారు. 30 ఏళ్లు ఏపీ సీఎంగా జ‌గ‌న్ ఉంటార‌ని, రాష్ట్రాన్ని మొద‌టి స్థానంలో ఉండేట్టు ఆయ‌న కృషి చేస్తున్నార‌ని పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అన్నారు. మ‌రో ఎమ్మెల్యే మేకా వెంక‌ట ప్రతాప అప్పారావు మాట్లాడుతూ జ‌గ‌న్ ప్రధాని స్థాయికి ఎదుగుతార‌ని, దేశంలో నాలుగు భాష‌లు మాట్లాడే సీఎం జ‌గ‌న్ ఒక్కరేన‌ని చెప్పారు. విజ‌య‌వాడలో గురువారం గృహ‌నిర్మాణాల స‌మీక్షలో ప‌లువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జ‌గ‌న్ ను పొగ‌డ్తల‌తో ముంచెత్తారు.

About Author