PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మళ్లీ ఆంధ్రాలో కలిపినా కలుపుతారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపినా కలుపుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమరులను మోదీ కించపర్చారన్నారు. తెలంగాణ త్యాగాలను, ఆకాంక్షను చిన్నగా చేసి చూస్తున్నారని మంత్రి అన్నారు. ఆరోజు తల్లిని చంపి బిడ్డను బతికించారని కామెంట్స్ చేశారని… మోదీ, బీజేపీ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ చట్టాల విషయంలో మూజువాణి ఓటుతో ఎలా బిల్‌ పాస్ చేశారని ప్రశ్నించారు.

        

About Author