NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల సమస్యలు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

1 min read

కర్నూలు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​

పల్లెవెలుగు వెబ్​: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ ను కర్నూల్  పార్లమెంట్ సభ్యులు ( లోక్ సభ ) గౌరవనీయులైన డాక్టర్ సంజీవ కుమార్ గారిచే ఆవిష్కరింపబడినది. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ అన్నిశాఖల ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని త్వరలో అన్నిసమస్యలు పరిస్కారం అవుతాయిన్నారు. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చా నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నక్కా రాముడు తో పాటు కర్నూల్ జిల్లా అధ్యక్షులు రఘుపతి  ప్రధాన కార్యదర్శి బి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు మద్దిలేటి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, పద్మావతి, రోస్ ప్రసన్న, కస్తూరి ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు పుల్లయ్య, అన్నపూర్ణ, మాలిక్ షావాలి, కృష్ణ మూర్తి మొదలైన వారు ఎంపీ గారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author