PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలందరికీ మేలు చేస్తా: టిడిపి అభ్యర్థి టి.జి భరత్

1 min read

42వ వార్డులో టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తనను గెలిపిస్తే ప్రజలందరికీ మేలు చేస్తానని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. సోమవారం 42వ వార్డు పరిధిలోని రాజీవ్ నగర్, బాబా బృందవన్ నగర్, వాణిజ్య నగర్‌లో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టి ప్రజలను కలిశారు. ఇంటింటికీ వెళ్లి కర్నూల్ అభివృద్ధి కోసం స్వయంగా రూపొందించిన ఆరు గ్యారంటీల కరపత్రాలను అందించారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిచి.. తమ ప్రభుత్వం రాగానే ఈ ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగాలు, మహిళలకు భద్రతా, ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తప్పకుండా ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వలీ, హరి, జూటురు నరేష్‌, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్, రంజిత్, సత్యారెడ్డి, రామకృష్ణ, షాషావలీ, సురేఖా, లక్ష్మీదేవి, ఉమా శ్రీ, మాధవి, అఫ్రీన్, గోవిందమ్మ, షాహిదా, అయ్యన్న, షేక్ హజ్ మున్నీసా, నసీమా, యస్మిన్ తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

About Author