PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంఐఎంను ఆర్జేడీలో విలీనం చేస్తారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బిహార్‌లో ఎంఐఎంకి ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఎంఐఎంకి బీహార్ లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు తొందరలోనే ఆర్‌జేడీలో చేరనున్నారట. ఇదే జరిగితే బిహార్ ఎంఐఎం పూర్తిగా ఆర్జేడీలో కలిసిపోయినట్టే అవుతుంది. ఈ విషయమై ఇప్పటికే ఆర్జేడీతో చర్చలు ముగిసాయని, తొందరలోనే విలీన ప్రక్రియ ఉంటుందనే వాదనలూ వస్తూనే ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రోజు నుంచే పెద్ద పార్టీలు తమను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయని బిహార్ ఎంఐఎం పక్ష నేత, ఎమ్మెల్యే అక్తరుల్ ఇమామ్ ఓ సందర్భంలో అన్నారు.

                                   

About Author