PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటా​: చెన్నబసప్ప

1 min read

పల్లెవెలుగు వెబ్​: మండల కేంద్రమైన కౌతాళం లోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన టిడిపి కార్యకర్త పాడేగల్ ఈరప్ప కుటుంబానికి అండగా ఉంటామని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప, జిల్లా రైతు కార్యదర్శి వెంకటపతి రాజు అన్నారు.నిన్న సాయంత్రం అనారోగ్యంతో కర్నూల్ హాస్పిటల్ లో పాడేగల్ ఈరప్ప మృతిచెందగా ఈరోజు శనివారం పార్థివ దేహానికి నివాళులర్పించి మట్టి ఖర్చుల కొరకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజబాబు, కోడిగుడ్ల రామాంజి, మూలింటి పంపన్న, భీమయ్య, రఘురాం, పుగ్గి నాగప్ప, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author