PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వ‌ర‌లో సంచ‌ల‌న వార్త చెబుతా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమని, రెండుమూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. జేడీఎస్ నేత దేవేగౌడ‌తో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా దేశానికి ఒరిగిందేమీ లేదని, ఉజ్వల్‌ భారత్‌ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయని, దేశంలో అపారమైన యువశక్తి ఉందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమే లక్ష్యంగా కేసీఆర్ కొంత కాలంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. పలు రాష్ట్రాల్లో బీజేపీతో రాజకీయంగా విభేదిస్తున్న పలు పార్టీల నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు.

                         

About Author