PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి వాయిస్ కూడ అనుక‌రిస్తారేమో !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ మ‌హిళ‌తో అస‌భ్యంగా మాట్లాడిన‌ట్టు ఉన్న ఆడియోలు ఇటీవ‌ల క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ విష‌యం పై ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు త‌న‌దైన శైలిలో స్పందించారు. గ‌తంలో పృథ్వీ, అంబ‌టి రాంబాబు, ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ మ‌హిళ‌ల‌కు ఫోన్లు చేసిన‌ట్టు ఆడియోలు బ‌య‌టికి వ‌చ్చాయ‌ని, ఆ ఫోన్లు తాము చేయ‌లేద‌ని స‌ద‌రు నేత‌లు చెబుతున్నార‌ని ర‌ఘురామ అన్నారు. పైగా ఆ నేత‌లు త‌మ‌ వాయిస్ ఎవ‌రో అనుక‌రించార‌ని చెబుతున్నార‌ని, ఇలాగే వ‌దిలేస్తే రేపు సీఎం జ‌గ‌న్ వాయిస్ కూడ అనుక‌రించి ఆడియో విడుద‌ల చేస్తార‌ని.. ఆ గొంతు అనుక‌రించే క‌ళాకారులు ఎవ‌రో తేల్చాని ర‌ఘురామ డిమాండ్ చేశారు. ఈ విష‌యం త్వర‌గా తేల్చక‌పోతే.. త‌నది, త‌మ ముఖ్యమంత్రి వాయిస్ కూడ అనుక‌రిస్తారేమోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ కేసుపై ముఖ్యమంత్రి, డీజీపీ దృష్టిసారించాల‌ని కోరారు. ఎంపీ ర‌ఘురామ ఢిల్లీలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

About Author