NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూమా ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీ వియ్యం అందుకోనుందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భూమా ఫ్యామిలీతో మంచు కుటుంబం వియ్యం అందుకోనుందా. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆ ప్రచారానికి ప్రధాన కారణం మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు.. రాజకీయంగా అనుభవం ఉన్న పెదరాయుడు మోహన్ బాబు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరున్న రాజకీయ కుటుంబం భూమా ఫ్యామిలీతో వియ్యానికి సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి తో హైదరాబాద్ నగరంలోని సీతాఫల్ మండి దగ్గర ఉన్న గణేష్ మండపంలో పూజలు నిర్వహించారు. అప్పుడే ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది.

                                          

About Author