PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేగా గెలిపించి పనితీరు చూడండి.. టిడిపి ఇంచార్జీ టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తనకు ఓటు వేసి గెలిపించి పనితీరు చూడాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 45 వ వార్డు అశోక్ నగర్లో ఆయన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైనా పింఛన్లు తీసివేశారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. టిడిపి వస్తే అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమం ఉంటుందన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సమస్యలన్నీ తీరుస్తానని చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు న్యాయం తప్పకుండా జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు సుంకన్న, సుందర రాజు, లక్ష్మన్న, ప్రభాకర్, రాముడు, నాగరాజు, సుధాకర్, రవి, ఆంజనేయులు, రమణ, రాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

About Author