PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేగా బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించండి

1 min read

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వెల్లడి

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ణీ కళ్యాణ మండపం నందు  గోనెగండ్ల మండల నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక  మండల నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2024 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న  శ్రీమతి బుట్టా రేణుక ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గోనెగండ్ల మండలం నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మండల కన్వీనర్ బి ర్ బసిరెడ్డి , బుట్టా శివ నీలకంఠప్ప, బుట్టా ప్రతుల్ , గోనెగండ్ల మండల ఎంపీపీ నసురుద్దీన్ గారు, వైస్ ఎంపీపీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల యూత్ ప్రెసిడెంట్, జి సి ఎస్ మండల కన్వీనర్, ఎంపీటీసీ, సర్పంచ్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author