PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ భ‌విష్యత్తు కోసం న‌న్ను గెలిపించండి.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన బండిమెట్ట వెంక‌టేష్‌

భారీగా త‌ర‌లివ‌చ్చిన మ‌హిళ‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు ప్రజ‌ల భ‌విష్యత్తు కోసం త‌నను గెలిపించాల‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కీటూ గోపి ఆధ్వర్యంలో 3వ వార్డు బండిమెట్ట ప్రాంతానికి చెందిన వెంక‌టేష్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజ‌ల క‌ష్టాలు తీరుతాయ‌న్నారు. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే అన్ని వ‌ర్గాల ప్రజ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ప‌రిశ్రమ‌లు తీసుకొచ్చి యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని చెప్పారు. ముస్లింలు కులం, మ‌తం చూడ‌కుండా ఈసారి త‌న‌కు ఓటు వేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ నాయ‌కుల వ‌ల్ల ప్రస్తుతం క‌ర్నూల్లో నీటి స‌మ‌స్య త‌లెత్తింద‌న్నారు. త‌న తండ్రి టి.జి వెంక‌టేష్ అధికారంలో ఉన్నప్పుడు నీటి కొర‌త లేకుండా చూసుకున్నట్లు గుర్తు చేశారు. తాను అధికారంలోకి రాగానే ఐదేళ్లలో నీటి స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం చూపుతాన‌ని భ‌రోసా ఇచ్చారు. యువ‌త‌కు ఉద్యోగాలు రావాలంటే సీఎంగా చంద్రబాబు, ఎమ్మెల్యేగా తాను గెల‌వాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎంపీ, ఎమ్మెల్యే రెండు మిష‌న్లలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల‌ని ఆయ‌న కోరారు.

About Author