NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప: తెలుగు దేశం పార్టీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డిని గెలిపించాలని టిడిపి నేతలు కోరారు. కడప నగరంలోని పోస్ట్ ఆఫీస్, ఎమ్మార్వో కార్యాలయం, ఎస్ ఎఫ్ సి, ఎపిఐ ఐ సి, పెన్షనర్ కార్యాలయాలలో రాం గోపాల్ రెడ్డికి మద్దతుగా కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వికాస్ హరి, టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, పార్లమెంట్ మీడియా కో ఆర్డినేటర్ జనార్దన్, టిడిపి నేత బసిరెడ్డి కృష్ణారెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలిలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గళం వినిపించేందుకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటు వేసి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ పార్లమెంట్ మీడియా కో ఆర్డినేటర్ విశ్వనాధ్, టిడిపి ఎన్ ఆర్ ఐ సభ్యులు ఆవుల వెంకటేష్, సూరి, తదితరులు పాల్గొన్నారు.

About Author