NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు అభివృద్ధికి.. టీజీ భరత్​ను గెలిపించండి..

1 min read

టీడీపీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం

పల్లెవెలుగు, కర్నూలు:నగరంలోని 42 వ వార్డు శివయ్య నగర్ మరియు  తిలక్ నగర్ నందు టిడిపి దళిత జేఏసీ ఆధ్వర్యంలో.. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి దళిత జేఏసీ  చైర్మన్ బోల్లెద్దుల రామకృష్ణ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఆన్యాయం జరిగిందని, దాడులు జరిగాయని ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి ఎస్సీల పొట్టగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొంటూ..కర్నూలు నగరంలో టీజీ భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ నాయకులు వార్డు మరియు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

About Author