PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి చేసే నాయ‌కుడిని గెలిపించండి..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్‌

వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 6వ వార్డు యువ‌కులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలును అభివృద్ధి చేసే నాయ‌కుడిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపించుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. ఆదివారం న‌గరంలోని మౌర్య ఇన్‌లో 6వ వార్డుకు చెందిన యువ‌కుడు షాకీర్ బృందం.. ఫైరోజ్, రజాక్ ఆధ్వ‌ర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌రత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. స్వార్థ‌పు ఆలోచ‌న‌ల‌తో తాము రాజ‌కీయాల్లో ఉండ‌టం లేద‌న్నారు. త‌న తండ్రి లాగే ప్ర‌జాసేవ చేసేందుకు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇత‌ర పార్టీల నాయ‌కులు ఐదేళ్ల‌లో ఎంత సంపాదించాల‌నుకుంటే.. తాను మాత్రం ఎంత అభివృద్ధి చేయాల‌ని ఆలోచిస్తాన‌ని భ‌ర‌త్ తెలిపారు. మంచి చేసేది ఎవర‌న్న‌ది నాయ‌కులు, ప్ర‌జ‌లు గుర్తించాల‌న్నారు. ఇక పార్టీలో చేరుతున్న వారు ఒక లీడ‌ర్ ద‌గ్గ‌రే ఉండాల‌న్నారు. పార్టీలు మారే నాయ‌కుల‌కు విలువ‌, గుర్తింపు ఉండ‌ద‌ని ఆయ‌న సూచించారు. త‌న‌ను న‌మ్మి పార్టీలో చేరిన వారంద‌రికీ ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న‌ను గెలిపిస్తే యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు త‌ప్ప‌కుండా కృషి చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నేత‌లు జ‌హంగీర్ బాషా, ఇబ్ర‌హీం, మెహ‌బూబ్‌, గౌస్‌, త‌దిత‌ర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author