PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24న రాష్ట్రస్థాయి చేనేత సదస్సును జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : ఈ నెల 24న జరిగే చేనేత రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని చేనేత సంఘాల ప్రతినిధులు నక్కలమిట్ట శ్రీనివాసులు, చింత శ్రీనివాసులు, దాశెట్టి శ్రీనివాసులు, గోరంట్ల శకుంతల లు పిలుపునిచ్చారు. శనివారం కృష్ణకాంత్ ప్లాజాలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నందవరం చౌడేశ్వరీదేవి ఆలయంలో ఈనెల 24న చేనేత సదస్సు జరుగుతుందని, సదస్సులో చేనేతవృత్తులు, చేనేత కార్మికుల సమస్యలు కూలంకషంగా చర్చించి వారి అభివృద్ధికి, సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కాబట్టి రాష్టంలో ఉన్న 13 చేనేత కుల సంఘాల నాయకులు చేనేత సంఘాల ఫెడరేషన్ చైర్మన్లు, నాయకులు, ప్రజాప్రాతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

About Author