PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యధిక మెజార్టీతో గెలిపించండి

1 min read

పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని టిడిపి నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు. శనివారం పశ్చిమ రాయలసీమ పట్టబద్రాలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని గెలిపించాలని, పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమ ప్రచారం నందికొట్కూరు మండలంలోని జెడ్పీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ ఉపాధ్యాయులు మేధావులు పట్టభద్రులు ఆలోచించి ప్రజా వ్యతిరేక విధనాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఉపాధ్యాయ,ఉద్యోగ, కార్మిక, నిరుద్యోగ, రైతు సమస్యలు పరిష్కారం కొరకు తెలుగుదేశం పార్టీ పట్టబద్రులు అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. మండల అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, నందికొట్కూరు పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్, ఐటీడీపీ అధ్యక్షులు ముర్తుజావలి, క్లస్టర్ కోఆర్డినేటర్ జాకీర్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ స్వామి జూపల్లి, మైనారిటీ సెల్ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుల్తాన్, తెలుగు యువత నాయకులు ప్రభు కుమార్, సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author