PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ అభ్యర్థులను గెలిపించండి

1 min read
ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​
పల్లెవెలుగు, కర్నూలు
ఈ నెల 10న జరగునున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని స్థానిక 1వ, 2వ, 5,7 వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో 90శాతం అమలు చేశారని, అమ్మ ఒడితో మొదలై వృద్ధాప్య పింఛన్​తో సహా… ఎన్నో పథకాలు అమలుచేసిన ఘనత ఏపీ సీఎంకే దక్కిందన్నారు. వైసీపీ కార్పొరేట్​ అభ్యర్థులను గెలిపిస్తే.. కర్నూలు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 1వ వార్డు అభ్యర్థి షాహవలి, 2వ వార్డు ఫిరోజ్​, 5వ వార్డు సుజాత, అదేవిధంగా 7వ వార్డు అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్​ రాష్ట్ర నాయకులు రియల్​ టైం నాగరాజు యాదవ్​, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

About Author