PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెలుపు ఓటములు సమానంగా స్పీకరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివెముల:  గెలుపు ఓటములు పక్కన బెట్టి క్రీడా పోటీల్లో ఉత్సహంగా పాల్గొనాలని జెడ్పీటీసీ సభ్యుడు ఆర్‌బీ చంద్రశేఖరరెడ్డి కోరారు.శుక్రవారం మండల కేంద్రమైన గడివేముల జెడ్పీ స్కూల్‌ నందు జరుగుతున్న ఆదుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో మండలస్థాయి సెమి ఫైనల్‌ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. టాస్‌ వేసి పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ క్రీడా రంగాన్ని ప్రొత్సహించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. నియోజకవర్గ,జిల్లా స్థాయి పోటీల్లో మంచిప్రతిభ చూపి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ పోటీల్లో గడివేముల జట్టు విజేతగా నిలిచింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బాలచెన్ని,ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప, పంచాయతీకార్యదర్శులు తారకేశ్వరీ, రంగడు,నాగేశ్,పీఈటీ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

About Author