PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ సబ్ స్టేషన్ లో వైర్ దొంగతనం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ లో దొంగతనం జరిగింది.ఎస్ఐ జగన్ మోహన్ తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు  సబ్ స్టేషన్ ఆవరణంలో ఉన్న 600 మీటర్ల వైరును దొంగలించినట్లు దీని విలువ 60వేలు చేస్తుందని మండల విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా చౌటుకూరు గ్రామంలో మా సుంబీ అనే మహిళ ఇంటి దగ్గర సారాయి అమ్ముతుండగా 10 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.మండలంలో ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్సై తెలిపారు.

About Author