PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏ2 సూట్ కేస్ కంపెనీల‌తో.. ఏ1 కార్యక‌లాపాలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ట్విట్టర్ లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌న‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నార‌ని న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఆరోపించారు. త‌న‌ను విదేశాల‌కు వెళ్లనివ్వకుండా చూడాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్రయ‌త్నిస్తున్నార‌ని అన్నారు. 20 కేసులున్న విజ‌యసాయిరెడ్డి విదేశాల‌కు వెళ్లవచ్చా అంటూ ప్రశ్నించారు. ఏ2 స్థాపించిన సూట్ కేసు కంపెనీల‌లో ఏ1 కార్యక‌లాపాలు నిర్వహించార‌ని అన్నారు. ఏ1 చేపట్టిన ప‌నుల‌పై ప్రధాని,రాష్ట్రప‌తికి లేఖ రాశాన‌ని తెలిపారు. క్విడ్ ప్రో కో , సూట్ కేసు కంపెనీల బాగోతాన్ని లేఖ‌లో వివ‌రించాన‌ని చెప్పారు. జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి పై చ‌ర్యలు తీసుకోవాల‌ని లేఖ‌లో కోరిన‌ట్టు తెలిపారు.

About Author