PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమన్వయంతోనే.. అభివృద్ధి సాధ్యం..

1 min read
మాట్లాడుతున్న నగర మేయర్​ బీవై రామయ్య

మాట్లాడుతున్న నగర మేయర్​ బీవై రామయ్య

అధికారులు, ప్రజలు సహకరించాలి
– నగర మేయర్​ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నగరంలో సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావాలంటే.. ప్రతిఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నగర మేయర్​ బీవై రామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. నగర అభివృద్ధికి అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు సహకరించాలని సూచించారు. సోమవారం మున్సిపల్​ కార్యాలయంలో కమిషనర్​ డీకే బాలాజి అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్​ బీవై రామయ్య మాట్లాడుతూ… కర్నూలు నగరాన్ని.. రాష్ట్రానికే.. రోల్​ మోడల్​గా తీర్చిదిద్దుదామన్నారు.

About Author