NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెస్క్యూతో..1533 బాలలకు విముక్తి

1 min read

– జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : జిల్లాలో మూడు రోజులపాటు జరిగిన ఆపరేషన్​ ముస్కాన్​ కార్యక్రమంతో 1533 బాలలకు విముక్తి కలిగింది. అనాథ, వీధి, తప్పిపోయిన బాలబాలికల గుర్తింపు కోసం ఎస్పీ డా. ఫక్కీరప్ప నేతృత్వంలో సీఐలు, ఎస్​ఐలు జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ నిర్వహించి, 1281 బాలురు, 252 బాలికలకు విముక్తి కల్పించారు. పని చేసే ప్రదేశాలలో బాల కార్మికులుగా మార్చబడిన బాల, బాలికలను పోలీసులు రెస్క్యూ చేసి ICDS, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ , CWC / JJB సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పోలీస్ అధికారులు బాల, బాలికలకు భోజనం, పండ్లు, బిస్కెట్లు, కూరగాయలు, దుస్తులు అందజేశారు. థర్మల్ స్కానర్ ద్వారా టెంపరేచర్ చెక్ చేయించి, వారికి కోవిడ్ రాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు.

About Author