PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడలతో.. జోష్​..

1 min read
ఫుట్​బాల్​ ఆడుతున్న ప్యాపిలి యువత

ఫుట్​బాల్​ ఆడుతున్న ప్యాపిలి యువత

  • ఎస్​ఐ మారుతి శంకర్​
    ప్యాపిలి వెబ్​, పల్లెవెలుగు : క్రీడలతో మానసికోల్లాసంతోపాటు శారీరక ధృఢత్వం లభిస్తుందని ప్యాపిలీ ఎస్​ఐ మారుతి శంకర్​ యువతకు పిలుపునిచ్చారు. గురువారం ప్యాపిలీ యువతకు క్రీడలపై మక్కువ పెంచేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగారు. పత్తికొండ నుంచి పదిమంది క్రీడాకారులను పిలిపించి.. ప్యాపిలి యువతతో ఫుట్​బాల్​ ఆడించారు. క్రీడల ప్రాధాన్యం తెలుసుకోవాలని, ఉద్యోగ సమయంలోనూ క్రీడలపై వచ్చిన సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. గతంలోనూ ఎస్​ఐ మారుతి శంకర్​ మిలిటరీ వెళ్లే యువతకు శిక్షణ ఉచితంగా ఇప్పించి… ఉద్యోగం వచ్చేలా తన వంతు కృషి చేశారు. ప్యాపిలి యువతను మంచి మార్గంలో నడిపించడంతోపాటు వారికి ఉద్యోగాన్వేషణపై దృష్టిసారేలా చూస్తున్న ఎస్​ఐ మారుతి శంకర్​ను ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

About Author