PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీఆర్సీ సాధన సమితి పిలుపుతో.. సమ్మెకు సై…!

1 min read

హెచ్​ఎంకు నోటీసులు అందజేసిన వసంత నగర్ ఉన్నత పాఠశాల సిబ్బంది

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: డిమాండ్ల సాధనే లక్ష్యంగా…  రాష్ట్ర పి ఆర్ సి సాధన సమితి పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమైనట్లు ప్రకటించారు కర్నూలు మండలం వసంత నగర్​ ఉన్నత పాఠశాల సిబ్బంది. ఈ మేరకు శనివారం ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ కు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రమణ గుప్త  మాట్లాడుతూ మీకు జీతాలు తగ్గడం లేదని.. లెక్కలు చెప్పే ఉపాధ్యాయులకు తప్పు లెక్కలను చెప్పటం దారుణం అన్నారు. సాంఘిక శాస్త్ర ఉపాద్యాయులు న్యామతుళ్ళ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు మరియు త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను ఈ ప్రభుత్వం ఒకే ఒక్క ఉత్తర్వుతో తుడిచి పెట్టేసింది. దాని ఫలితం ఛలో విజయవాడలో కనిపించింది అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి రుక్సానా గారు,శ్రీమతి సరిత గారు,శ్రీమతి మహా లక్ష్మీ గారు,శ్రీనివాస రెడ్డి గారు,మస్తాన్ వలి గారు,శ్రీనాథ్ గారు,యోగానంద్ రెడ్డి గారు,పుల్లన్న గారు,మనోహర్ గారు మరియు జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ రెడ్డి గారు తమ సమ్మె నోటీసులు సమర్పించారు.

About Author