PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ఆదేశాలతో.. వాల్మీకి నగర్​లో బోరు ఏర్పాటు..

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి ఆదేశాలతో వైసీపీ పట్టణాధ్యక్షుడు దేవా నేతృత్వంలో బోరు ఏర్పాటు చేశారు. కాలనీలో నీటి సమస్య ఉందని, వేసవి సమీపిస్తున్న క్రమంలో బోరు వేయించాలని వాల్మికినగర్​ ప్రజలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి గతంలో కోరారు. అప్పట్లో బోరు వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మంగళవారం వాల్మీకినగర్​లో బోరు ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింలు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవా పూజ చేసి బోర్ స్టార్ట్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుధాకర్ , మల్లి, పూలతోట రాముడు, రాజు , రామకృష్ణ , వెంకటేష్, షరీఫ్, భవాని, ప్రతాపు, యువరాజ్, రఘు తదితరులు పాల్గొన్నారు.

About Author