PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ఎన్నికలతో… బాబుకు రాజకీయ సమాధి..

1 min read

వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి 20వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ . దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి తర్వాత ప్రజల్లో ఇంతటి అభిమానాన్ని చూరగొన్న నేత కేవలం జగనన్ననే అన్నారు. కుట్రలు కుతంత్రాల చంద్రబాబుకు ఈ ఎన్నికలతో రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ముస్లిం మైనారిటీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంనటం తమ అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

About Author