NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాస్క్ లేకుంటే.. 1000 ఫైన్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : క‌రోన వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధ‌రించని వారికి వెయ్యి రూపాయ‌ల ఫైన్ విధిస్తామ‌ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస‌రావు తెలిపారు. ఒమిక్రాన్ వైర‌స్ ఇప్పటికే 20 దేశాల‌కు పాకింది. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్‌ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు.. ఎక్కడికి వెళ్లిన వ్యాక్సినేషన్‌ పత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తామన్నారు. రిస్క్‌  దేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన 325 మంది  ప్రయాణికులకు పరీక్షలు చేయడం జరిగిందని.. వీరిలో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని హెల్త్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా, జీనోమ్‌ సిక్వెన్స్‌కి నమునాలు పంపించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author