PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు: ఎంపీపీ తాత రమ్య  

1 min read

పల్లెవెలుగువెబ్​, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం మహిళలు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారన్నారు పెదవేగి ఎంపీపీ తాత రమ్య. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో విజయరాయి సచివాలయం 2 కార్యదర్శి సౌజన్య ను ఎంపీపీ, ఎంపీడీవో రాజ్ మనోజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో సౌజన్య ప్రధమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషమని ఆమె అన్నారు. గతంలో కూడా రాష్ట్ర, జాతీయస్థాయిలో ఈమె అనేక పథకాలు సాధించడం జరిగిందని ఇటీవల జరిగిన పోటీలలో గెలుపొందడం ఎంతో సంతోషం అని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలపడం జరిగింది అని అలాగే పలువురు ఈమె సాధించిన విజయం పట్ల శుభాకాంక్షలు తెలుపుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి వైద్యాధికారి టీవీ ఎల్ పి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author