PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నచ్చింది ధరించే హక్కు మహిళలకు ఉంది

1 min read

పల్లెవెలుగువెబ్ : హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చారనే కారణంగా తరగతి గదులకు అనుమతించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా బాసటగా నిలిచారు. తాము ఎలాంటి దుస్తులు ధరించుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని, ఆ హక్కుకు భారత రాజ్యంగం హామీ ఇస్తోందని అన్నారు. బికినీ వేసుకోవాలా, చీరకొంగుతో ముసుగు వేసుకోవాలా, జీన్స్ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే ఉంటుందని అన్నారు. వస్త్రధారణ పేరుతో మహిళలను వేధించడం ఆపాలని ఒక ట్వీట్‌లో ప్రియాంక పేర్కొన్నారు. ‘లడ్‌కీహూ లడ్‌సక్‌తీ హూ’ అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా ఇచ్చారు.

       

About Author