NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డి

1 min read


పల్లెవెలుగు వెబ్​, ఆదోని: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి. మంగళవారం పట్టణంలోని కార్వన్​పేట దుల్షాన్​ పైల్వాన్​ దర్గా దగ్గర దాదాపు 7 వార్డు (12, 13, 14, 25, 26 ,27)లకు సంబంధించి పొదుపు మహిళలకు వైయస్సార్ ఆసరా రెండో విడత కింద పొదుపు గ్రూపులకు ఒక కోటి 17 లక్షలు 37,696 రూపాయలు మహిళలకు ఖాతాలో వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తించకుండా.. మహిళలను మోసం చేశారన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి. దేవా, మున్సిపల్ కమిషనర్ జి. వి. కృష్ణ , మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంతి, త్రీటౌన్ సీఐ నరేష్ బాబు, శ్రీకాంత్ రెడ్డి , రామలింగేశ్వర యాదవ్, ఆర్టీసీ రహీం, హాజీ, రామంజి, కన్నా వెంకటేష్, శీను, మెప్మా అధికారులు వీరారెడ్డి , జావేద్ , లలిత, సచివాలయం సిబ్బంది ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.

About Author