PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

1 min read
మాజీ ఎంపీ బుట్టా రేణుకను సన్మానిస్తున్న కార్పొరేటర్లు

మాజీ ఎంపీ బుట్టా రేణుకను సన్మానిస్తున్న కార్పొరేటర్లు

  • మాజీ ఎంపీ బుట్టా రేణుక
    పల్లెవెలుగు వెబ్​, కల్లూరు: మహిళలు రాజకీయంగా,సామాజికంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడు.. దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శనివారం కల్లూరు ఆదిత్య స్కూల్ ఆవరణలో కుర్ని సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత కార్పొరేటర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లడుతూ రాష్ట్రంలో ఇటివల జరిగిన ప్రత్యక్ష ఎన్నికలలో మహిళలలకు 50 శాతం కంటే ఎక్కువ సీట్స్ ఇవ్వడమే కాకుండా 56 బిసి సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు మరియు డైరెక్టర్ లో కూడా 50 శాతం కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికే సాధ్యమయ్యిందన్నారు. అదేవిధంగా మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తూ వారిని బలోపేతం కోసం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇటవల గెలిచినా కార్పొరేటర్లు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని నిరంతరం వారి సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ 32 వా వార్డ్ కార్పొరేటర్ సాన శ్రీనివాసులు, 33 వ వార్డ్ కార్పొరేటర్ నరసింహులు, ఎమ్మిగనూరు మునిసిపాలిటి 6 వ వార్డు కార్పొరేటర్ శివ ప్రసాద్ , 26 వార్డ్ మీసాల నీలకంట , 1 వ వార్డు కార్పొరేటర్ కామర్తి నాగేశాప్పా , కుర్ని కరికాల కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణ వేణి మాజీ ఎంపి బుట్టా రేణుకను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుర్ని సంఘం రాష్ట్ర నాయకులూ నక్కలమిట్ట శ్రీనివాసులు , అజయ్ కుమార్ , ఓమకరయ్య , వసుదేవయ్య , కృష్ణయ్య , గడిగా ప్రసాద్, గణప చెన్నప్ప, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author