PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళ న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఈనెల 11వరకు మహిళల కొరకు జరిగే ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ దివ్య సూచించారు.శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కస్తూర్బా గాంధీ పాటశాలలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.మహిళా హక్కుల పరి రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయి అని మేజిస్ట్రేట్ దివ్య తెలిపారు.మహిళా చట్టాలను మహిళలు సక్రమంగా వినియోగించు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు బి టీ.నాగేష్,మధుబాబు, దామోదరాచారి,నెట్టేకల్లు, కస్తూర్బా గాంధీ పాటశాల ప్రిన్సిపాల్ ,లోక్ అదాలత్ క్లర్క్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author