PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళా ఓటర్లను చైతన్య వంతం చేయడమే స్వీప్ కార్యక్రమాల లక్ష్యం..

1 min read

ఒక్కరోజులో 4 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులతో  స్వీప్ కార్యక్రమo నిర్వహణ..

ఒక్కరోజులో 4 లక్షల మహిళా సమైక్య సభ్యులతో స్వీఫ్ ద్వారా ఎథికల్ ఓటింగ్..

నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్, డిఆర్డిఏ పిడి ఆర్ విజయ రాజు

 పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును  వినియోగించుకునేలా పటిష్ట  చైతన్య కార్యక్రమాల ఏర్పాట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జిల్లాలో 92 శాతం పోలింగ్   పెంచే లక్ష్యంగా యుద్ధ ప్రాతి పదికన అవగాహన కార్యక్రమాల నిర్వహణ స్వీప్ జిల్లా నోడల్ అధికారి & జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ వెల్లడిoరు. జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా 45 రోజులపాటు ముమ్మరంగా స్వీప్ చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలుతో కార్యాచరణ సిద్ధం చేశామని స్వీప్ జిల్లా నోడల్ అధికారి & జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ చెప్పారు. బుట్టాయిగూడెం మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో శనివారం ‘సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ & ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్’ (SVEEP) కార్యకలాపాలు & స్వీప్ 2024 జిల్లా కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా నిర్వహించిన మహిళా చైతన్య కార్యక్రమంలో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ఓటు ద్వారా పారదర్శక పాలన అందించే మంచి నాయకుడును ఎన్నుకొనే ప్రక్రియలో మహిళలు కీలక భాగస్వాములు కావాలని పిలుపినిచ్చారు. 45 రోజుల స్వీప్ ప్రణాళిక అమలును డీపీఓ వివరించి మహిళా సహకారంతో జిల్లాలో ఏథికల్ ఓటింగ్ శాతం అన్ని ప్రాంతాలలో పెరగాలన్నారు. ఓటర్లు రిజిస్ట్రేషన్, ఈ.వి.యమ్ వినియోగం, ఓటింగ్ విధానం తదితర అంశాలలో ప్రజలను చైతన్య పర్చడానికి యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా మాథ్యమాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అనంతరం  డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ టర్నోవర్ ఇప్లిమెంటేషన్ ప్లాన్ రూపొందించడం జరిగిందనో, దానిని క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు, సహకారం తీసుకుంటున్నామని, దానిలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. విజయ్ రాజ్ సహకారంతో ఒక్కరోజులోనే 4 లక్షల మహిళా సమైక్య సభ్యులతో స్వేప్ ద్వారా ఏథికల్ ఓటింగ్, ఓటింగ్ శాతం పెంచడం, ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. .  జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో 92 శాతం పోలింగ్ నమోదయ్యే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.  ఇందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించడం జరిగిందని స్వీప్ నోడల్ అధికారి, డిపివో తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు.  గత ఎన్నికల్లో జిల్లా సగటు ఎన్నికల పోలింగ్ 86 శాతం నమోదైయిందని ఏలూరు అర్బన్ ప్రాంతంలో 69.02 శాతం నమోదయిందని డి పి ఓ గుర్తు చేశారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని ఏలూరు అర్బన్ తోపాటు నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ప్రాంతాల్లోకూడా ఓటర్ టర్నవుట్ పెంపు లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నామని  అన్నారు.  ప్రతి నియోజకవర్గంలో గతఎన్నికల్లో నమోదైయిన సగటు ఓటింగ్ శాతాన్ని 3 విభాగాలుగా విభజించుకొని ఆదిశగా ఎక్కడైతే పోలింగ్ శాతం తక్కువగా నమోదయిందో అందుకు గల కారణాలను విశ్లేషించడం ఆ నాటి ప్రభుత్వ యంత్రఅంగం పనితీరు పై కూడా పోస్ట్ మార్టం జరుగుతుందని, దానికి అనుగుణంగా నియోజకవర్గంలో ఓటర్ టర్నోవర్ ఇప్లిమెంటేషన్ ప్లాన్ ను అమలు చేస్తామన్నారు.   విభిన్న ప్రతిభావంతులు నూరుశాతం ఓటు వినియోగించుకునేలా, వృద్ధాశ్రమంలో వున్నవారు ట్రాన్స్ జండర్స్ లను గుర్తించి వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్ల పై కూడా దృష్టి పెట్టే విధంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నేతృత్వం లో నూతన కార్యాచరణ చేపట్టడం జరిగిందని అన్నారు.  వయోవృద్ధులు, నడవలేనిపరిస్ధితుల్లో ఉన్నవారు, తదితరులకోసం హోం ఓటింగ్ అమలుచేసేందుకు ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తున్నదని డి పి ఓ అన్నారు. ఇందుకు సంబంధించిన  నిబంధనలు అందిన వెంటనే వాటిని తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజులలోపు సంబంధిత పోస్టల్ బ్యాలెట్ కు ధరఖాస్తు చేసుకోవల్సియుంటుందన్నారు.  స్వీప్ కార్యక్రమంలో బాగంగా చునావ్ పాఠశాల కార్యక్రమాలను త్వరలో జరుపనున్నామని డీపీఓ అన్నారు. క్యాంపస్ అంబాసిడర్లతో ఆయా నియోజవర్గ రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించి వారికి కూడా ఈవిఎంలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. .    స్వీప్ కార్యక్రమాల అమలుపై కాలేజీలలో, మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాలలో అవగాహన కలిగించే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.  ప్రజా స్వామ్యంలో మనహక్కుల సాధనకు ఏవిధంగా పోరాడతామో అదే విదంగా ఓటుహక్కు వినియోగించుకోవడం కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారి కె. అద్దయ్య మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం, పోలవరం పరిధిలో ఓటర్ టర్నవుట్ పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  ఓటర్లు వారి అభిష్టంమేరకు ప్రశాంతంగా సజావుగా తమఓటుహక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.  విద్యార్ధుల బాగస్వామ్యం స్వీప్ కార్యక్రమాల్లో ఎంతో అవసరమని వారి ద్వారా అన్ని ప్రాంతాలకు సంబంధిత సమాచారం చేరే అవకాశం వుంటుందన్నారు.  డిఆర్ డిఏ పిడి ఆర్. విజయ్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో 30 రోజుల పాటు ఈవిఎంల పస్ట్ లెవల్ చెకింగ్ రాజకీయ పక్షాల ప్రతినిధుల సమక్షంలో బెల్ ఇంజనీర్లు తనిఖీ చేయడం జరిగిందన్నారు.  నామినేషన్ల ముందు ఒకసారి, గుర్తులు కేటాయించబడిన అనంతరం ర్యాండమైజేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.  పోలింగ్ కు ముందు కూడా మాక్ పోల్ నిర్వహిస్తారని అదే విదంగా ఏదైనా సందేహాలు ఉంటే టెస్ట్ ఓటింగ్ ద్వారా కూడా ఈవిఎంల పనితీరును పరిశీలించేందుకు అవకాశం ఉందన్నారు.  ఈ సందర్బంగా జిల్లాలో మార్చి 31వరకు నిర్వహించే స్వీప్ కార్యక్రమ కార్యచరణకు డి.ఆర్.డి.ఎ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. అనంతరం బుట్టాయిగూడెం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్వీప్ అమలులో భాగంగా ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో ఎంపీడీపీ ప్రవీణ్ కుమార్, డీపీఎం సుబ్బారావు, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.

About Author