PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీపీఓ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..

1 min read

సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారు

డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్.

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : మహిళలు మహారాణులని, సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. డీపీఓ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. సందర్బంగా డీపీఓ దంపతులు శ్రీనివాస విశ్వనాధ్, శైలజ మహిళా ఉద్యోగులను శాలువ కప్పి, పుష్పగుత్తి ఇచ్చి సత్కరించారు. మహిళా ఉద్యోగులకు అండగా ఉంటానని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. మహిళా ఉద్యోగులు అందర్నీ పురుష ఉద్యోగుల వరుసక్రమంలో సత్కరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. మహిళలు మహారాణులు అంటూ వారిని గొప్పగా కొనియాడారు. ఈ  కార్యక్రమంలో సి.డి.పి.ఓ రాజశేఖర్, సిబ్బంది కె. సునీత, మల్లికా, జి. విజయ, ఫాతిమా, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, తహెరా, సోములు, పులి సత్యనారాయణ, భాస్కర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

About Author