PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ విజయానికి కృషి చేయండి: టీజీ భరత్​

1 min read

– పార్టీలో చేరిన 48వ వార్డు ప్రజలు

పల్లెవెలుగు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ సమక్షంలో 48వ వార్డు పరిధిలోని అమీర్ హైదర్ ఖాన్ నగర్ వాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి నేతలు జహంగీర్ బాషా, ఇబ్రహీం, మెహబూబ్ ఆధ్వర్యంలో అన్వర్, ఖాజా, ఆచారి, తదితరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టిజి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కష్టపడి పనిచేయాలని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కర్నూల్ లో తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. అమీర్ హైదర్ ఖాన్ నగర్లో ఉన్న   సమస్యలని పరిష్కరిస్తానని వారికి టిజి భరత్ హామీ ఇచ్చారు.

About Author