PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి విజ‌యం కోసం ప్ర‌తి ఒక్కరూ క‌ష్టప‌డాలి..

1 min read

టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్.టిడిపిలో చేరిన బంగారుపేట వైసీపీ నేతలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రానున్న 40 రోజులు నాయ‌కులు, కార్యక‌ర్తలు క‌ష్టప‌డి తనని గెలిపిస్తే ఐదేళ్ల పాటు ప్రజలకు మంచి భ‌విష్యత్తు అందిస్తాన‌ని క‌ర్నూలు నియోజ‌కవ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. ఆదివారం మౌర్య ఇన్‌లో బంగారుపేట‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు ఏలియా తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్.. ఏలియాతో పాటు బంగారుపేట‌కు చెందిన యువ‌కులు, మ‌హిళ‌ల‌కు కండువాలు వేసి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంద‌న్నారు. పార్టీలో చేరిన నాయ‌కులకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్క నాయ‌కుడు, కార్య‌క‌ర్త విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు. వైసీపీ నాయకుల నాట‌కాలు న‌మ్మకుండా ప్రజ‌ల్లో చైత‌న్యం తీసుకురావాల‌న్నారు. ప్రజ‌ల‌కు ఎంత మాత్రం మేలు చేయ‌ని వైసీపీ నాయ‌కులు మాట‌ల‌ను కోట‌లు దాటిస్తార‌న్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ప్ర‌జ‌ల భ‌విష్యత్తు ఎంతో బాగుంటుంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే ప్ర‌జా ప్రభుత్వం వ‌చ్చిన‌ట్లే అన్నారు. ఇక క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే ప్రజ‌ల క‌ష్టాలు తీరుస్తాన‌ని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళిక‌తో న‌గ‌రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో ర‌వి, ప్రభాక‌ర్‌, దేవ‌దానం, మ‌హేష్‌, ప‌వ‌న్, ప్ర‌భావ‌తి, ధ‌న‌ల‌క్ష్మి, నాగ‌ల‌క్ష్మి, ప్రభావ‌తి, శివ‌మ్మ‌, దాన‌మ్మ‌, మంజుల‌, త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత‌లు శ్రీనివాస రెడ్డి, సురేష్‌, పురుషోత్తం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author